వాడుకోవడం కూడా విజయానికి ఓ సోపానం. ఎవర్ని అయినా తమకు అనుకూలంగా చేసుకోవడం ప్రజా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. అందులో వైసీపీ అధినేత జగన్ బాగా వెనకబడిపోయారా ఆని అంటున్నారు. ఆయన తనను మాత్రమే నమ్ముకున్నారనిపిస్తుంది.


వైసీపీలో ఈసారి చూస్తే ఒకరు ఇద్దరు కాదు. ఎంతో మంది సినీ నటులు, ఇతర విభాగాల వారు వచ్చి చేరారు. జగన్ వారి సేవలను ఈ కీలకమైన ఎన్నికల వేళ వాడుకుంటే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. కమేడియన్ ఆలీ, సీనియర్ నటీమణి జయసుధ, నటుడు, రచయిత పోసాని క్రిష్ణ  మురళీ వంటి వారిని ఏపీ అంతా తిప్పితే వచ్చే వూపే వేరుగా ఉంటుంది. జగన్ కుటుంబం నిజానికి అందరూ పెద్ద స్టార్ కాంపెనియర్లు. విజయమ్మ, షర్మిల  ఇలా ఎవరు జనంలోకి వెళ్ళినా బాగా మాట్లాడుతారు. జనం కూడా వెల్లువలా వస్తున్నారు.


అది ఎంత బాగా అనుకూలించినా ఇంకా తటస్థులు, మిగిలిన వర్గాల వారు ఉంటారు. వారిని ఆకట్టుకోవాలంటే కచ్చితంగా సినిమా నటులు సరిపోతారు. వారి చెప్పేది కూడా బాగా జనంలోకి వెళ్తుంది. మోహన్ బాబు వంటి వారి సేవలను అప్పట్లో అన్న నందమూరి, తరువాత చంద్రబాబు ఉపయోగించుకున్నారు. జగన్ మాత్రం వారిని పిలవడం లేదో, వారే  రావడం లేదో తెలియదు కానీ అతి కీలకమైన ఈ ఎన్నికల్లో వారిని కనుక రప్పిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు. మరి వైసీపీ మేనేజ్మెంట్ టీం అది సీరియస్ గా తీసుకుంటే బాగుంటుందని వైఎస్సార్ అభిమానులు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: