మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ఈ సమ్మర్ కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. మహేష్ బాబు పక్కన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు మరియు అదే విధంగా మహేష్ పక్కన కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు. ఇదిలావుండగా తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రమంగా మహేష్ తన తర్వాత ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి తో సిద్ధం చేసుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే.

Image result for mahesh babu

ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ సినిమా ప్రాజెక్టు గురించి మరియు బడ్జెట్ గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాకి నిర్మాతలు అయినా అనిల్ సుంకర, దిల్ రాజులకు చెప్పాడట.

Image result for mahesh babu

మహేష్ బాబు రెమ్యునరేషన్ కాకుండా ఈ చిత్రానికి 50 కోట్ల బడ్జెట్ కావాలని అనిల్ రావిపూడి అడిగాడట. మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రానికి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి 40 కోట్ల వరకు ధర పలికినట్లు తెలుస్తోంది. దీనితో అనిల్ రావిపూడి చిత్ర శాటిలైట్, డిజిటల్, హిందీ హక్కులని 50 కోట్లకు అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: