సమంత, నాగచైతన్య.. తెలుగు తెరపైనే ప్రేమ ప్రయాణం చేసిన జంట. ఆ ప్రేమను నిజజీవితంలోకి ఆహ్వానించుకున్న జంట.. ప్రేమను పండించుకున్న జంట. పెళ్లి తర్వాత కూడా తెరపై ప్రేమకావ్యాలు సృజియిస్తున్న జంట. ఈ జంట తాజాగా నటించిన మజిలీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆసక్తికరంగా సాగింది. 


ఈ కార్యక్రమంలో మాట్లాడిన సమంత.. మనం సినిమా తర్వాత తనకు మజిలీ అంత గొప్ప సినిమా అవుతుందని ఆకాక్షించింది. పెళ్లి కి ముందు ప్రేమలో ఉన్నప్పుడు చాలా అనుకుంటామని.. కానీ పెళ్లి తర్వాత అనుభవం వేరేగా ఉంటుందని సమంత చెబుతోంది. 


ఈ కార్యక్రమానికి వెంకటేశ్, నాగార్జున ఇద్దరూ హాజరుకావడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని సమంత అంటోంది. మీ ఇద్దరు రెండు పిల్లర్స్ అని కామెంట్ చేసింది. ప్రేమ తర్వాత పెళ్లి గురించి పెద్దగా సినిమాలు రాలేదని.. ఈ సినిమా ద్వారా ఆ లోటు తీరుతుందని చెప్పింది.. 

చివరగా నాగచైతన్య గురించి సమంత భలేగా సిగ్గుపడుతూ మాట్లాడింది. మా ఆయన గురించి నేనే చెబితే అంత బావుండదు అంటూ సిగ్గుపడింది. కానీ ఏప్రిల్ 5 తర్వాత చై నటన మీరే చెబుతారు. అని విని నేను చాలా సంతోష పడతాను..అని ధీమాగా చెప్పింది సమంత.



మరింత సమాచారం తెలుసుకోండి: