ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోవడంతో నాయకులు అంతా ఒకరి పై ఒకరు దుమ్మెత్తిపోసుకునే కార్యక్రమాన్ని క్లైమాక్స్ కు తీసుకువెళుతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఎన్నికల గుర్తు ‘గ్లాసు’ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టిస్తున్నాయి. 

ఈ ఎన్నికల తరువాత వచ్చే ఫలితాలతో ‘ఫ్యాన్’ ఇంటికి పరిమితం అయితే ‘గ్లాసు’ బార్ లోకి వెళ్లిపోతుందనీ కేవలం ‘సైకిల్’ మాత్రమే అసెంబ్లీకి వెళుతుంది అంటూ బాలయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ – జనసేనలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఏకంగా తెలుగుదేశ వర్గాలకే తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. 

గత కొన్నిరోజులుగా పవన్ చంద్రబాబును టార్గెట్ చేయకుండా కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో బాలకృష్ణ ‘జనసేన’ గుర్తు పై అనాలోచితంగా చేసిన కామెంట్స్ కు పవన్ డైరెక్ట్ గా కాకపోయినా నాగబాబు చేత రియాక్ట్ అయ్యేలా చేసి తెలుగుదేశంను చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేసే ఆస్కారం ఉంది అని వార్తలు వస్తున్నాయి. 

దీనితో ప్రచారం క్లైమాక్స్ కు వచ్చిన వేళ అనవసరంగా బాలకృష్ణ పవన్ ను కెలికాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఎన్నికల ప్రచారంలో తరుచూ ఎదో ఒక వివాదంలో బాలకృష్ణ చిక్కుకోవడం బాలయ్య అభిమానులను కూడ కలిచివేస్తోంది. ప్రస్తుతం హిందూపురంలో బాలయ్యకు ఎదురుగాలి వీస్తోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో బాలకృష్ణ ఇలా అసహనంతో కామెంట్ చేసి ఉంటాడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: