త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈసారైన త్రివిక్రమ్ బన్నీకి బ్లాక్ బస్టర్ హిట్టిస్తాడా..! అనే సందేహం చాలామందిలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అందుకు కారణం కూడా బలంగానే ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' అనుకున్నంత కమర్షియల్ సక్సస్ ని సాధించలేకపోయాయి. భారీ అంచనాలతో రిలీజైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ లెక్కలను తారుమారు చేశాయి. మరీ డిజాస్టర్స్ కాకపోయినప్పటికి ఈ రెండు సినిమాలు బన్నీకి భారీ సక్సస్ ని మాత్రం ఇవ్వలేదనే చెప్పాలి.


'అరవింద సమేత వీర రాఘవ' తో తారక్ కి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సారి ఎలాగైన బన్నీకి గట్టి హిట్టావాలనే తాపత్రయంతో ఉన్నాడట. ఇక 'దువ్వాడ జగన్నాథం', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలతో ఫ్లాప్ లను చూసిన బన్నీ యంగ్ డైరెక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్ చెప్పిన కథలు నచ్చక ఇలాంటి టైం లో త్రివిక్రమ్ అయితేనే సేఫ్ అని తనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి థియోటర్లలోకి ఎప్పుడు వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు.


అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ కూడా డిలే అవుతూ వస్తుంది. అందుకు కారణం కూడా బన్నీనేనట. గతంలో త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' లానే ఈ సినిమా కథ కూడా నాన్న సెంటిమెట్ తో సాగుతుందట. అందుకనే బన్నీ కథలో కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడని దానివల్లే ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా టైమ్ పడుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: