టాలీవుడ్ లో బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్.  భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా అప్పుడే భారీ అంచనాలు పెంచుతుంది.  ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్.  ఇక వివాహనాంతరం సమంత వరుస విజయాలు అందుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో బిజీ బిజీగా ఉన్నారు.   అంతే కాదు మహానటి, రంగస్థలం లాంటి సినిమాల్లో ప్రయోగాత్మ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది సమంత.

అలాంటి సమంత త్వరలో ప్రభాస్ సరసన కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సాహూ’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా పూర్తయిన తర్వాత  'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ ఓ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక క్రేజీ డైరెక్టర్ తో కథను సిద్ధం చేయిస్తోన్న దిల్ రాజు.  ఈ సినిమాలో ప్రభాస్ సరసన సమంతను  సమంతను ఎంపిక చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: