తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, అగస్త్య సంయుక్తంగా తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మొదటి నుంచి ఎన్నో వివాదాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రతిష్ట దెబ్బతీసేలా చిత్రం ఉందని ఆరోపిస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో కోర్టు నవ్యాంధ్రలో విడుదలపై స్టే విధించిన విషయం తెలిసిందే. 

అయితే గత నెల 29 న మాత్రం తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రిలీజ్ కావడం మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్ల దిశగా సాగుతుంది.  చాలా కాలం తర్వాత వర్మ మార్క్ చాటారని ప్రేక్షకులు ముక్త కంఠంతో అంటున్నారు. 

తాజాగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’సినిమాను నవ్యాంధ్రలో కూడా విడుదలకు అనుమతించాలంటూ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి ఈరోజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఆడేందుకు అనుమతించాలని రాకేష్‌ రెడ్డి సుప్రీం కోర్టును కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: