ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని ఉధృతం చేసి చాల పదునైన కామెంట్స్ చేస్తున్నాడు. ఈ కామెంట్స్ మధ్యలో జరగబోతున్నది కురుక్షేత్ర సంగ్రామం అనీ తాను శ్రీకృష్ణుడును అంటూ ఒక బహిరంగ సభలో చేసిన కామెంట్స్ పై విపరీతమైన సెటైర్లు పడుతున్నాయి. పవన్ కృష్ణుడు అయితే అర్జునుడు ఎవరు అంటూ కొందరు జోక్స్ పేలుస్తున్నారు.

మరి కొందరైతే శ్రీక్రుష్ణుడుకి అష్ట భార్యలు ఉన్న నేపధ్యంలో పవన్ అదే తీరును అనుసరిస్తూ ఇంకా చాల పెళ్ళిళ్ళు చేసుకుంటాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు తన ఎన్నికల ఉపన్యాసాలలో రాజకీయ నాయకుల తాట తీస్తాను అంటూ ఆవేశంగా ఊగిపోయే పవన్ ఇప్పుడు రూట్ మార్చి ఏకంగా శ్రీక్రుష్ణుడుతో పోల్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

దీనితో పవన్ తాను గతంలో నటించిన ‘గోపాల గోపాల’ సినిమా గుర్తుకు వచ్చి ఇలా కలియుగ కృష్ణుడుగా భావిస్తున్నాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు ఈమధ్య ఈమధ్య పవన్ చెట్టుకింద కూర్చుని పెరుగన్నం తినడం పై లెక్కలేనన్ని కార్టూన్లు అనేక పత్రికలలో వచ్చాయి. అంతేకాదు  చెట్టు కింద కూర్చునే వాడికి ఎన్నికలలో ప్రచారం చేయడానికి హెలికాప్టర్ లు పవన్ కు ఎక్కడ నుంచి వచ్చాయి అంటూ మరికొందరు ఎదురు ప్రశ్నిస్తున్నారు. 

ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోకుండా పవన్ తన ప్రచార వేగాన్ని మరింత పెంచి తన వ్యూహాత్మక రాజకీయాలు కొనసాగిస్తున్నాడు. అయితే ప్రస్తుతం పవన్ కు భీమవరంతో పాటు గాజువాకలో కూడ ఎదురుగాలి వీస్తోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో కనీసం ఈ రెండు స్థానాలలో ఎదో ఒకచోట పవన్ గెలవకపోతే పవర్ స్టార్
భవిష్యత్ ఏమిటి అన్న కోణంలో ప్రస్తుతం పవన్ అభిమానుల మధ్య కూడ చర్చలు జరుగుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: