టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సుమారు పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తీసుకున్నారు.  ఆ సమయంలో ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.  మరోసారి వెండితెరపై కనిపించాలనే ఆయన నిర్ణయంతో మెగా అభిమానులు సంతోష పడిపోయారు.  వివివినాయర్ దర్శకత్వంలో రైతు సమస్యలపై పోరాడే ఓ సామాజిక కార్యకర్తగా..అల్లరి చిల్లరిగా తిరిగే ఓ దొంగ క్యారెక్టర్ పాత్రలో కనిపించి మెగా పవర్ ఏంలో చూపించారు.  ఈ సినిమా ఘన విజయం తర్వాత తన 151 వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు. 

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.  నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అమితాబ్ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ .. కోకాపేటలో వేసిన 'బీదర్' కోట సెట్లో, ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.  తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 9వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. 

ఈ సినిమాకి, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ కారణంగానే యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని చెబుతున్నారు.   చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ‘సైరా’ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారని సమాచారం. అంతా ఓకే అయితే ఆగస్టులో విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: