విలక్షణ నటుడు మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం కోసం మండుతున్న ఎండలను కూడ లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం చేస్తూ చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనితో మోహన్ బాబు పై తెలుగుదేశం పార్టీ నాయకుల ఎదురుదాడి మొదలైంది.
ముఖ్యంగా అనేక టివి చర్చా వేదికలకు స్పీకర్ గా వచ్చే పంచుమర్తి అనురాధ మోహన్ బాబును టార్గెట్ చేస్తూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. 25 ఏళ్ల కిందట నిమ్స్లో సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చీపుళ్లతో తరిమికొట్టిన విషయాన్ని మోహన్బాబు మరిచిపోయారా అంటూ ప్రశ్నించడమే కాకుండా గతంలో ఎయిర్ హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించిన చరిత్ర మోహన్ బాబుకు గుర్తు లేదా అంటూ అనురాధా ప్రశ్నించారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలోనే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో కూడ కలకలం సృష్టిస్తున్నాయి. అదేవిధంగా సీనియర్ నటి జయంతి చేతిలో చెప్పుదెబ్బలు తిన్న చరిత్ర సాక్షి శివానంద్పై దాడి చేసిన ఘనత మోహన్బాబు మరిచిపోయారా అంటూ పంచుమర్తి అనురాధా మరింత తీవ్ర స్థాయి వ్యాఖ్మలు చేసారు.
ముఖ్యంగా తన కుమారుడి ప్రేమ వ్యవహారం ఓ టీవీ చాన ల్లో చూపితే, రివాల్వర్తో వెళ్లి మీడియా సిబ్బందిని మోహన్ బాబు బెదిరించలేదా అంటూ ఆమె ప్రశ్నించారు.
ముఖ్యంగా ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో నటించినందుకు ఎన్టీఆర్కు ఇవ్వాల్సిన పారితోషికం కూడ ఎగ్గొట్టిన చరిత్ర మోహన్ బాబుది అంటూ ఆమె గతంలో జరిగిన మరొకసారి గుర్తుకు చేస్తున్నారు. దీనితో మోహన్ బాబు వ్యక్తిగత జీవితం పై అనురాధ చేసిన కామెంట్స్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను కూడ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇప్పుడు కామెంట్స్ కు మోహన్ బాబు సమాధానం ఇస్తాడా లేదంటే వ్యూహాత్మక మౌనం పాటిస్తాడా అన్న విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది..