నవ్వుల రారాజు బ్రహ్మానందం కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం లేదు. కమెడియన్ గా మూడు దశాబ్ధాలుగా ప్రేక్షకులను నవ్విస్తున్న బ్రహ్మాందం ఈమధ్య గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్ట్యూట్ లో బ్రహ్మానందంకు సర్జరీ జరిగింది. 


ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు బ్రహ్మానందం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. గుండె ఆపరేషన్ తర్వాత వెంకన్న దర్శనానికి రావడం ఇదే మొదటిసారి. బ్రహ్మానందంను చూసిన అక్కడ ప్రేక్షకులు సంతోషపడ్డారు. బ్రహ్మితో పాటుగా ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి నాగ చైతన్య, సమంత వచ్చారు.   


వారిద్దరు కలిసి నటించిన మజిలీ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుండగా రిలీజ్ ముందు స్వామి ఆశీర్వాదాలను పొందేందుకు వచ్చారు మజిలీ టీం. బ్రహ్మిని చూసిన సమంత, చైతులు కూడా ఆయన్ను ఆప్యాయంగా పలుకరించారు. బ్రహ్మానందంతో పాటుగా ఆయన సతీమణి, చిన్న కొడుకు వెంట వచ్చారు. ప్రజలను చూస్తూ బ్రహ్మి చేసిన అభివాదం అందరిని ఆకట్టుకుంది.


కొన్నాళ్లు కెరియర్ పరంగా వెనుకపడ్డ బ్రహ్మానందం కాస్త ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్లీ సినిమాల్లో రాణించాలని చూస్తున్నారు. కామెడీకి కేరాఫ్ అడెస్ గా మారిన బ్రహ్మానందం మళ్లీ వరుస సినిమాలు చేసి మనల్ని కడుపుబ్బా నవ్వించాలని ఆశిద్దాం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: