ఏప్రిల్ 11న జరుగనున్న ఏపి ఎలక్షన్స్ లో టిడిపి వర్సెస్ వైసిపి పోటీ ఎలా ఉందో అందరికి తెలిసిందే. అయితే ఈమధ్య చంద్రబాబు నిజ స్వరూపం ఇది అని తెలియచేస్తూ వచ్చిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ చూశాక కొందరు టిడిపి ఫాలోవర్స్ కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఆ సినిమా దర్శకుడు రాం గోపాల్ వర్మ లేటెస్ట్ గా టిడిపికి అసలైన వారసుడు లోకేష్ కాదు జూనియర్ ఎన్.టి.ఆర్ అని తేల్చి చెప్పేశాడు.


నిజమైన సీనియర్ ఎన్.టి.ఆర్, జూనియర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా చూశాకే ఓటు వేయాలని ట్వీట్ చేశారు అంతేకాదు టిడిపి భవిష్యత్ జూనియర్ ఎన్.టి.ఆర్ చేతుల్లో ఉందని.. తారకే టిడిపికి అసలైన వారసుడని ట్వీట్ చేశాడు ఆర్జివి. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను కూడా ఏపిలో రిలీజ్ కాకుండా అడ్డుపడ్డారు.


వర్మతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసిందే. అందుకే ఆర్జివి అడుగడుగునా బాబు మీద సెటైర్లు, పంచులు వేస్తున్నాడు. మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో కూడా మోహన్ బాబు చంద్రబాబుకి అందరిని వాడుకుని వదిలేయడం బాగా తెలుసని వ్యాఖ్యానించారు. తారక్ ను కూడా అలానే వాడుకుని వదిలేశాడని అన్నారు.


మొత్తానికి అటు వర్మ ట్విట్టర్ లో మోహన్ బాబు ప్రెస్ మీట్ లలో టిడిపికి ఏగైనెస్ట్ గా మాట్లాడుతూ జూనియర్ ఎన్.టి.ఆర్ పేరు ప్రస్థావించడం హాట్ న్యూస్ గా మారింది. అయితే తారక్ ఫ్యాన్స్ వర్మ కామెంట్స్ కు సంబరపడుతున్నా చంద్రబాబు ఫ్యాన్స్, టిడిపి ఫాలోవర్స్ మాత్రం రుసరుసలాడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: