తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సంచలన చిత్రాలు తీసిన రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెరకెక్కించారు.  ఈ చిత్రంపై మొదటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో చంద్రబాబు ను విమర్శిస్తూ తీస్తున్నారని టీడీపీ శ్రేణులు కోర్టు మెట్లు ఎక్కారు.   ఈ చిత్రం రిలీజ్ ఆపడానికి ఎన్నో ఎత్తులు వేశారు..కానీ కోర్టు మాత్రం ఈ చిత్రం రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పారు.  అయితే ఏపిలో తప్ప ఈ చిత్రం అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది. 

అయితే రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  మంచి హిట్ కావడంతో ఈ చిత్రం గురించి తెలుగు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.  ఈ మద్య తన ట్విట్లతో ఎన్నో సంచలనాలు రేపుతున్న రాంగోపాల్ వర్మ తాజాగా మరో ట్వీట్ తో సంచలనం రేపారు. జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి భవిష్యత్తు అంటూ మరోమారు వేడి రాజేశారు.

సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేసిన వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే నిజాయతీపరులైన, అసలైన ఎన్టీఆర్ అభిమానులంతా ఓటు వేయాలని కోరారు. అంతే కాదు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న నారా లోకేష్ వారసుడు కానేకాదని, తారక్ మాత్రమే అసలైన వారసుడని పేర్కొన్నారు. అతడితోనే టీడీపీకి భవిష్యత్తు అని స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: