ఎట్టకేలకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మధ్య ఒక రాజీ కుదిరినట్లుగా వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రాజీ  ఫార్ములాను అల్లు అరవింద్ రంగంలోకి దిగి సెట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈకధకు సంబంధించిన ఏర్పడ్డ భేదాభిప్రాయాలు మాత్రమే కాకుండా ఈ మూవీ బడ్జెట్ విషయంలో బన్ని త్రివిక్రమ్ ల మధ్య ఏర్పడిన భిన్నాభిప్రాయాలను కూడా అరవింద్ చాకచక్యంగా సరిదిద్దినట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి భారీ బడ్జెట్ ఖర్చుపెట్టే విషయంలో అల్లు అర్జున్ పెద్దగా ఆశక్తి కనపరచలేదు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈమూవీ కథ రీత్యా అన్నీ అనుకున్నట్లుగా జరిగి మూవీ అవుట్ పుట్  బాగుండాలి అంటే ఖచ్చితంగా ఈమూవీ పై 80 కోట్ల ఖర్చు పెట్టి తీరాలి అని పట్టుపట్టిన త్రివిక్రమ్ పట్టుదల నెగ్గినట్లు తెలుస్తోంది. 

ఇక ఈమూవీ హీరోయిన్ ఎంపికలో కూడ త్రివిక్రమ్ తన మాట నెగ్గించుకుని పూజ హెగ్డేను ఫైనల్ చేసినట్లు టాక్. అదేవిధంగా ఈమూవీలో త్రివిక్రమ్ తన ప్రియమిత్రుడు సునీల్ కు మరో కీలక పాత్ర క్రియేట్ చేసి కనీసం ఈమూవీ ద్వారా అయినా అతడికి బ్రేక్ ఇవ్వాలి అని మరొకసారి ప్రయత్నిస్తున్నాడు. 

ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ డేట్ తో కూడిన అధికారిక ప్రకటన అదేవిధంగా నటీనటుల ఎంపిక ప్రకటన ఈవారం రాబోతున్న ఉగాది రోజున ఉంటుంది అని సమాచారం. సినిమాలకు సంబంధించి చాలా వేగంగా స్క్రిప్ట్ వ్రాసే త్రివిక్రమ్ బన్నీ సినిమా కోసం చేసినన్ని మార్పులు చేర్పులు అతడి కెరియర్ లో ఇప్పటి వరకు ఏసినిమాకు చేయలేదని త్రివిక్రమ్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: