ఏపి ఎలక్షన్స్ లో ఈసారి ప్రజలందరు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిఎంగా చేస్తారని అంటున్నాడు మంచు మోహన్ బాబు పెద్ద కొడుకు మంచి విష్ణు. జగన్ ఆహ్వానాన్ని మన్నించి నాన్న వైసిపిలోకి వెళ్లడం జరిగిందని. జగన్ వస్తే ప్రజలు కష్టాలు తీరుతాయని అన్నారు. తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.


చిత్తూరు జిల్లాలో తాను వైసిపి తరపున ప్రచారంలో పాల్గొంటానని అన్నారు మంచు విష్ణు. బుధవారం తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చిన మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఈసారి ప్రజలందరు జగన్ వైపే ఉన్నారని కచ్చితంగా ఏపి సిఎంగా జగన్ అవ్వడం కన్ఫాం అన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణు ఓటర్ ఈమధ్య టీజర్ తో సందడి చేసింది.


త్వరలోనే శ్రీను వైట్లతో కలిసి సినిమా చేస్తున్నట్టు చెప్పారు మంచు విష్ణు. ఢీ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇదే. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని అన్నారు మంచు విష్ణు. లాస్ట్ ఇయర్ రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా కూడా శ్రీను వైట్లకు ఫ్లాప్ ఇచ్చింది.


అందుకే ఈసారి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో పక్కా హిట్ తో రావాలని చూస్తున్నాడు. మంచు విష్ణు కూడా ఢీ కాంబో మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ కాంబినేషన్ లో సినిమ మళ్లీ ఢీ రిజల్ట్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. మంచు విష్ణూ ఈ మధ్య సినిమాల వేగం తగ్గించాడు. అయితే ఇకనుండి వరుస సినిమాలు చేస్తానని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: