పవన్ కొద్ది రోజుల క్రితం ఒక న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన ‘జనసేన’ ఎన్నికల ప్రచారానికి చిరంజీవి రాడు అని స్పష్టంగా తెలియచేసాడు. ఈ సంఘటన జరిగి ఒకరోజు గడవకుండానే చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్ధి కోసం తెలంగాణాలో ప్రచారం చేయబోతున్నాడు అని వస్తున్న వార్తలు పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి చేవెళ్ళ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుపు కోసం ఒక రోడ్ షోను నిర్వహించమని చిరంజీవి కోడలు తన మామగారి పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. దీనికి కారణం కొండా విశ్వేశ్వర రెడ్డి ఉపాసన బాబాయి కావడం అని అంటున్నారు. 

అయితే ఈ విషయమై చిరంజీవి ఎటూ తేల్చకుండా రోజులు గడుపుతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసారి ఎన్నికలకు దూరంగా చిరంజీవి ఉండాలని భావించిన విషయం తెలిసిందే. స్వయంగా రాహుల్ గాంధీ ప్రచారం చేయమని చిరంజీవిని అడిగినా మెగా స్టార్ సున్నితంగా ‘సైరా’ వంక పెట్టి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఇలాంటి పరిస్థుతులలో ఉపాసన ఒత్తిడికి మెత్తబడి తాను కాంగ్రెస్ అభ్యర్ధి కోసం ప్రచారం చేస్తే ఆవిషయం ఖచ్చితంగా పవన్ అభిమానులకు బాధ కలిగిస్తుంది అన్న విషయం చిరంజీవి దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీనికితోడు చిరంజీవి తమ్ముళ్ళు ఇద్దరూ ఎన్నికలలో పోటీ చేస్తున్నా వారిని గెలిపించమని కనీసపు పిలుపు కూడ ఇవ్వని చిరంజీవి ఇప్పుడు ఇలా చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్ధి కోసం రోడ్ షోలు చేస్తే తనకు మెగా అభిమానుల నుంచి మాత్రమే కాకుండా పవన్ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని టెన్షన్ పడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: