కోటీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళ నాట అజిత్ కుమార్ కి ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉంది.  అజిత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు అభిమానులు థియేటర్ల వద్ద సందడి ఓ రేంజ్ లో ఉంటుంది.  వరుస విజయాలతో ఆయన తన దూకుడు కొనసాగిస్తూనే వస్తున్నాడు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన 'విశ్వాసం' మూవీ రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం అజిత్ హిందీలో విజయం సాధించిన సందేశాత్మక మూవీ ‘పింక్‌’ ఆధారంగా తెరకెక్కుతున్న  ‘నేర్‌కొండ పార్వై’ లో నటిస్తున్నాడు.


ఈ సినిమా ‘ధీరన్‌ అధిగారం ఒండ్రు’ ఫేమ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.  అజిత్ కి జోడీగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు.  ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రల్లో  శ్రద్ధ శ్రీనాధ్‌, అభిరామి, ఆండ్రియా తరియంగ్‌లు  నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగం సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. మొత్తం 40 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశారు.  ప్రస్తుతం నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి.  హిందీలో అమితాబ్ చేసిన పాత్రను తమిళంలో అజిత్ చేస్తున్నాడు.


వాస్తవానికి మే ఒకటిన అజిత్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే షూటింగ్‌ ప్రారంభించడం ఆలస్యం కావడంతో మూవీని ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీదేవితో ఉన్న స్నేహంతో ఈ సినిమాలో అజిత్‌ నటించారు.  హిందీ వెర్షన్‌కు దీనికి చాలా మార్పులు ఉన్నాయని, కథానాయిక సన్నివేశాలు అధికంగా ఉంటాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: