టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’షూటింగ్ బిజీలో ఉన్న విషయం తెలిసిందే.  తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ తో తన స్టామినా ఏంటో చూపించాడు మెగాస్టార్ చిరంజీవి.  పది సంవత్సారల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 లాంటి కమర్షియల్ హిట్ తో మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచారు.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అలనాటి పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంతో ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నాడు. 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే.  ఈ మేరకు చిరంజీవి  తన కోడలు ఉపాసన బాబాయ్ అయిన కాంగ్రేస్ ఎంపి క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర రెడ్డి తరుపున క్యాంపైన్ చేయబోతున్నట్లు  ఈ మద్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి సన్నిహితుల చెప్పిన సమాచారం మేరకు ఆయన ‘సైరా’ప్రాజెక్ట్ పైనే దృష్టి సారిస్తున్నారని..తన సోదరుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ తరుపు నుంచి కూడా ఎలాంటి ప్రచారం చేయడం లేదని వివరించారు. 

కాకపోతే జనసేన తరుపు నుంచి ప్రచారం చేయడానికి రమ్మనమని అడిగింది మాత్రం నిజం. అయితే తాను సినిమా పనుల్లో పూర్తి బిజిగా ఉన్నానని, రాలేనని సున్నితంగా చెప్పారట. ‘సైరా: నరసింహారెడ్డి’ షూటింగ్ చివరి  దశకు చేరుకుంది. దసరాకు విడుదల చేయాలనకుంటున్నారట. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: