తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ జంట అంటే వెంటనే చెబుతారు చైతూ, సామ్ అని.  ‘ఏం మాయ చేసావే’చిత్రంతో పరిచయం అయిన ఈ జంట తర్వాత ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలతో మరింత దగ్గరయ్యారు.  మనం చిత్రం తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి కూడ చేసుకున్నారు.  మనం చిత్ర తర్వాత ఈ మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. 'నిన్ను కోరి' వంటి హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.   పెళ్లి తరువాత చైతన్య - సమంత కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ట్రైలర్ లో ఎమోషన్స్ పీక్స్ లో ఉండడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని విక్షించిన సుశాంత్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.  దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా సున్నితంగా డీల్ చేశాడని..ప్రేమ, బాధ రెండింటిని చాలా బ్యాలెన్స్ గా చూపించాడని చెప్పాడు. 


ఇక తమ పాత్రల్లో నటించారు అనేకన్నా జీవించారు అని అనొచ్చు. దివ్యాంక బాగా నటించిందని.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గోపిసుందర్ మ్యూజిక్ హృదయాలను హత్తుకునేలా ఉందని అన్నారు. ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఎవరైనా ఎమోషనల్ గా ఫీల్ కావాల్సిందే అంటూ ట్విట్టర్ లో తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: