‘మజిలీ’ టాక్ ఇంకా బయటకు రాకుండానే నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్నరాత్రి ‘మజిలీ’ స్పెషల్ షోను చూసినట్లు తెలుస్తోంది. ఈసినిమా సెకండ్ ఆఫ్ చూస్తూ ఉన్నంత సేపు నాగార్జున ఎమోషనల్ గా మారిపోవడమే కాకుండా కొన్ని సందర్భాలలో తన కంటి నుండి వచ్చిన కన్నీరు ఆపుకోలేకపోయినట్లు ఈ స్పెషల్ ను నాగార్జునతో కలిసి చూసినవారు లీక్ చేయడంతో న్యూస్ బయటకు వచ్చింది. 

ముఖ్యంగా ఈమూవీ సెకండ్ ఆఫ్ లో చైతన్య సమంతతో ఘర్షణ పడుతూ డైవర్స్ తీసుకోవడానికి ప్రయత్నించిన సన్నివేశాలు నాగ్ ను బాగా కదిలించి వేసినట్లు టాక్. ముఖ్యంగా పరిస్తుతులను ఎదిరిస్తూ చివరకు తన భర్త ప్రేమను పొందిన సమంత పాత్ర నాగార్జునకు విపరీతంగా నచ్చినట్లు తెలుస్తోంది. 

ఈమూవీ స్పెషల్ షోను చూసి ఆమూవీలోని సన్నివేశాలతో పూర్తిగా ఎమోషనల్ గా మారిపోయినా నాగార్జున నిన్న అర్దరాత్రి చేసిన ట్విట్ వైరల్ గా మారింది. ‘చై సమంత మీ అద్భుత నటనను చూసి గర్వపడుతున్నాను రావ్ రమేశ్ పోసానిల నటన అద్భుతంగా ఉంది మజిలీ టీమ్ కు నా శుభాకాంక్షలు’.

సాధారణంగా ఇప్పటి వరకు నాగార్జున తన కొడుకులు నటించిన సినిమాలలోని సిన్నివేశాలకు ఈవిధంగా కనెక్ట్ అయిన సందర్భాలు చాల అరుదు. అయితే నాగ్ ను ‘మజిలీ’ ఈవిధంగా కదిలించి వేయడంతో చైతన్య కోరుకున్న సూపర్ హిట్ ‘మజిలీ’ అందించబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే నాగార్జునను ఇంతగా కదిలించిన ఈమూవీ పై ప్రేక్షకుల నుండి ఫైనల్ రిజల్ట్ ఇంకా రావలసి ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: