తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రంపై మొదటి నుంచి రక రకాలుగా ప్రమోషన్ వర్క్ చేస్తూ అందరి దృష్టి మళ్లించే విషయంలో రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యారు.  ఈ చిత్రం మొదటి నుంచి ఎన్నో వివాదాల మద్య గత నెల 29 న రిలీజ్ అయ్యింది.  కాకపోతే ఏపిలో మాత్రం ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.  ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం ఉంటుందని కొంతమంది హై కోర్టును ఆశ్రయించడంతో .. న్యాయస్థానం స్టే విధించింది. 

ఈ విషయంపై చిత్ర యూనిట్ సుప్రీమ్ కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.  అంతే కాదు ఈ చిత్రం పైరసీ కోరల్లో కూడా చిక్కుకుంది.  అయితే ఓ చిత్రంపై ఇంత కక్ష్య పూరిత చర్యలు తీసుకుంటారా అని రాంగోపాల్ వర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తన ఆవేదనను పెయింటింగ్స్ రూపంలో తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.  గొలుసులతో కట్టేయబడిన ఒక కోతిపిల్ల పెయింటింగును వర్మ షేర్ చేశారు. ఆ కోతిపిల్లను 'లక్ష్మీస్ ఎన్టీఆర్'  ఈ చిత్రం రిలీజ్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను..ఇక అలసి పోయాను అనేది దాని భావంగా పేర్కొన్నారు. 

ఇక తల్లికోతి .. పిల్లకోతిని ఓదార్చే మరో పెయింటింగును కూడా ఆయన షేర్ చేశారు. ఈ బొమ్మలో తాను తల్లి కోతిగా..లక్ష్మీస్ ఎన్టీఆర్ పిల్ల కోతిగా ఏపిలో ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పరిస్థితి ఇది అంటూ తన భావాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: