భరత్ అనే నేను తర్వాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమా షూటింగు పరంగా ముగింపు దశకి చేరుకుంది.  అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కొన్ని రోజుల వరకు బయటకు రాలేదు.  షూటింగ్ కూడా చాలా గోప్యంగా జరుపుతూ వచ్చారు.  దాంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందటంతో ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 

ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఎన్నో కాంట్రవర్సీలు నెలకొన్నాయి. మొత్తానికి అంతా ఒకే అయి..మే 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా పోస్టర్లు మాత్రం అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి ఊరటనిస్తున్నారు చిత్ర యూనిట్.  తాజాగా 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో  కార్పొరేట్ స్టైల్ బిజినెస్ మేన్ లుక్ తో కనిపిస్తూ మహేశ్ బాబు మరింతగా ఆకట్టుకుంటున్నాడు. 

ఉగాది సందర్భంగా రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకి ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తాజా పోస్టర్ ద్వారా మరోసారి స్పష్టం చేశారు.  మరి రేపు ఏ రేంజ్ లో టీజర్ కట్ చేస్తారో అని ఫ్యాన్స్ తెగ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.  పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: