ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఏం చేసినా..ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.  కొన్ని విషయాలు  నమ్మాలా నమ్మోద్దా అన్నది కూడా పట్టించుకోకుండా ప్రతి విషయాన్ని వైరల్ చేస్తుంటారు.  తాజాగా దక్షిణాది నెంబర్ వన్ హీరోయిన్ నయన తార ప్రియుడు విఘ్నేష్ అన్న చిన్న మాటతో ఓ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. వివరాల్లోకి వెళితే..నయనతార ఈ మద్య లేడీ ఓరియెంటెడ్ ముఖ్యంగా హర్రర్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది. ఆ సినిమాలు కూడా వరుస సక్సెస్ లు సాధిస్తున్నాయి.   

హారర్ థ్రిల్లర్ మూవీస్ కి కాసుల వర్షం కురించే ప్రధాన ఆధారంగా అక్కడ నయనతార మారిపోయింది.  ఈ నేపథ్యంలో నయనతార ప్రధాన పాత్రధారిగా 'కొలయుతిర్ కాలం' సినిమా రూపొందింది. చక్రి తోలేటి దర్శకత్వంలో వసు భగ్నాని .. దీప్సిక దేశ్ ముఖ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాను అనుకున్నట్టుగా తీయలేకపోయారు .. అసంపూర్తిగా అనిపిస్తోందంటూ నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ కామెంట్ చేశాడు.

ఇండస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది.  దాంతో ఈ సినిమాను కొనడానికి కొత్త బయ్యర్లు ముందుకు రాకపోగా, అడ్వాన్స్ ఇచ్చిన బయ్యర్లు వెనక్కి అడుగుతున్నారట. డిజిటిల్ .. శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడ్డవాళ్లు .. ఇప్పుడు ఈ సినిమా హక్కులు తమకి వద్దని చెప్పేస్తున్నారట.  దాంతో ఇప్పుడు నయన్ ప్రియుడు విఘ్నేష్ పై నిర్మాతలు మండిపడుతున్నారు. ఆయన కారణంగా తమకి జరిగిన డ్యామేజ్ గురించి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు.  ఈ విషయంపై  విఘ్నేశ్ శివన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: