తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి.  ముఖ్యంగా వెంకటేష్ ఈ తరహా చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నారు.  ఈ సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2 చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  తాజాగా బాబీ దర్శకత్వంలో వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా 'వెంకీమామ' రూపొందుతోంది. 

ఈ సినిమాలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇటీవలే రాజమండ్రిలో ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది.  'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ  చిత్రం టైటిల్ లోగోను రిలీజ్ చేశారు.  ఈ ఇద్దరి పాత్రలను బాబీ చాలా వైవిధ్యభరితంగా మలిచాడట.

రాశి చక్రంలో 'వెంకీ' అనేది ఆంగ్ల అక్షరాలతో .. 'మామ' అనేది తెలుగు అక్షరాల్లో డిజైన్ చేశారు. పోస్టర్లో ఒక వైపున పల్లెటూరు .. మరో వైపున యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.  దసరా పండుగకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: