ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టాన్ని చూసి అకిరా నందన్  భావిద్వేగంతో చేసిన ట్విట్ వైరల్ గా మారింది. ‘కొద్ది రోజులుగా నిద్రహారాలు లేవు. విశ్రాంతి లేకుండా  నాన్న  శ్రమిస్తున్న తీరుచూస్తే కంట్లో నీరు ఉబికి వస్తోంది. డీహైడ్రేషన్‌తో బాధపడుతూ కూడా తెనాలి సభకు హాజరుకాబోతున్నారు. ఓ మనిషి ఎంత మేరకు కష్టపడాలో అంతమేరకు శ్రమిస్తున్నారు. ప్రజల కోసం సర్వం ధారపోస్తున్నాడు’ అంటూ అఖిరా నందన్ చేసిన  ట్వీట్ పవన్ అభిమానులకు మాత్రమే కాకుండా జనసైనికులకు కూడ బాగా కనెక్ట్ అయింది. 

ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకున్న నేపధ్యంలో నిన్న పవన్ అస్వస్థతకు గురి కావడంతో పవన్ అభిమానులు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ విజయానికి అయిన ఎన్నికల చివరి రోజులలో జరిగే పోల్ మేనేజ్ మెంట్ అత్యంత కీలకం అయిన నేపధ్యంలో పవన్ ఆరోగ్యం ఇప్పడు దెబ్బతినడం హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు పవన్ ఈరోజున ప్రచారానికి దూరంగా ఉంటారని తెలియడంతో జనసైనికులు కలవర పడిపోతున్నారు. 

ఇది ఇలా ఉండగా ‘జనసేన’ పార్టీకి మద్దతు తెలుపుతూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. ‘ప్రజాశ్రేయస్సుకు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రత్యక్షంగా తాము అందుబాటులో లేకపోయినా మీకు మా సంపూర్ణ సహకారం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ప్రచారంలో దూసుకుపోవాలని ఆశిస్తున్నాం. విజయంతో తిరిగి రావాలని కోరుకొంటున్నాం’ అంటూ అల్లు అర్జున్ పవన్ కు మద్దతు తెలియచేసాడు.   అంతేకాదు ఏపీ ప్రజల జీవితాల్లో పవన్ కల్యాణ్ కొత్త కాంతిని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం సఫలమవుతుందని నమ్ముతున్నాను అంటూ ట్విట్ చేసి పవన్ అభిమానులలో జోష్ ను పెంచడానికి తన వంతు ప్రయత్నం చేసాడు.  
 
ఇది ఇలా ఉండగా ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు వచ్చిన నేపధ్యంలో పవన్ కు వచ్చిన అస్వస్థత నుండి వెంటనే తేరుకుని ఎన్నికలకు సంబంధించిన ఆఖరి రోజుల ప్రచారాన్ని పవన్ మరింత వేగంగా కొనసాగించాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పవన్ సభలకు జనం బాగానే వస్తున్నా ఆజనం చేత ఎంతవరకు ఓట్లు పోల్ చేయించుకుంటారు అన్న విషయమై పవన్ విజయం ఆధారపడి ఉంటుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: