తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ కి ఈరోజు నిజంగా కొత్త సంవత్సరం ఉగాది పండగు ‘మహర్షి’ రూపంలో వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు.  భరత్ అనే నేను సినిమా తర్వాత ఎంతో కాలం ఊరించి..ఊరించి.. ఈ రోజు వంశి పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’టీజర్ రిలీజ్ చేశారు.  ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.  'మహర్షి' టీజర్ ఉగాది పర్వదినం సందర్భంగా కొద్దిసేపటి క్రితం విడుదలైంది. 1.19 సెకన్ల నిడివివున్న ఈ టీజర్ వీడియోలో మహేశ్, చాలా స్టయిలిష్ గా చూపించారు. 


ఇక టీజర్ విషయానికి వస్తే.. రిషికుమార్ మల్టీ బిలియనీర్ గా ఆకాశహర్మ్యాల మధ్య చాపర్ లో   దిగడంతో టీజర్ మొదలవుతుంది.  "రిషికుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్టేనా?" అని మీడియా సమావేశంలో తాను ఎదుర్కొన్న ప్రశ్నకు "సక్సెస్ లో పుల్ స్టాప్స్ ఉండవు. కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ" అన్న డైలాగ్, "నాకో ప్రాబ్లమ్ ఉంది సార్... ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే... గెలిచి చూపించడం నాకు అలవాటు" అన్న డైలాగులున్నాయి. కొంత కాలంగా ఈ సినిమాపై రక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. 


ఈ సినిమాలో ధనవంతుడైన మహేష్ బాబు నిరుపేద అయిన తన స్నేహితుడు అల్లరి నరేష్ కోసం ఇండియా వచ్చి ఇక్కడ రైతులు పడుతున్న కష్టాలు చూసి వారిని బాగు చేస్తాడని..ఈ సినిమాలో అందరూ ఊహించినట్లుగానే మహేష్ కోటీశ్వరుడిగా కనిపించారు..మరి మిగతా కథ ఎలా ఉండబోతుందో..ట్రైలర్..వెండితెరపై చూస్తే కానీ అర్థం కాదు. మహేష్ సరసన పూజా హెగ్డె నటిస్తుంది. మరో ముఖ్యపాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు. టీజర్ విడుదలైన నిమిషాల వ్యవధిలోనే దీని వ్యూస్ లక్షల్లోకి వెళ్లిపోవతం గమనార్హం. ఈ టీజర్ ను మీరూ చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: