సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు.

ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఉగాది కానుకగా ఈరోజు రిలీజ్ చేశారు. మహర్షి సినిమాపై మరింత అంచనాలు పెంచేలా టీజర్ ఉంది. అయితే టీజర్ లో హైలెట్స్ గా చెప్పుకుంటే మహేష్ లుక్ అదిరిపోగా.. ఆ తర్వాత సూటు బూటు వేసుకుని స్టైలిష్ గా ఓ పక్క మాస్ లుక్ లో మరోపక్క కనిపించాడు.


అంతేకాదు సక్సెస్ ఈజ్ నాటే డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అంటూ రిషి జర్నీలో అందరు పాల్గొనాలని చెప్పాడు. ఓడిపోతా అన్న ప్రతిసారి గెలిచి చూపిస్తా అని తన స్టామినా గురించి చెప్పాడు. ఓవరాల్ గా మహేష్ ఫ్యాన్స్ కు ఉగాది కానుకగా వచ్చిన మహర్షి టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ గా మారింది. 


అయితే సినిమాలో యాక్షన్ పార్ట్ లో తోటలో ఫైట్ సీన్ మాత్రం శ్రీమంతుడు సినిమాలో మహేష్ ను తలపిస్తుంది. సేమ్ ఫైట్ జస్ట్ లుక్ మారింది అంటే అనేలా ఉంది. వంశీ పైడిపల్లి ఎంతో జాగ్రత్తగా చేస్తున్న ఈ మహర్షి మీద చిత్రయూనిట్ మొత్తం ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. మరి మహేష్ మహర్షి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: