భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు మణిరత్నం.  ఈయన తీసిన సినిమాలు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నాయి.  మణిరత్నం దర్శకత్వంలో ఒక్క సినిమా ఛాన్స్ దొరికినా చాలు అన్న సినీ నటులు ఎంతో మంది ఉన్నారు.   1997లో ఇద్దరు సినిమాలో తన అందచందాలతో సమ్మోహితులను చేసింది మాజీ విశ్వ  సుందరి ఐశ్వర్యరాయ్‌.  ఆ తర్వాత ఐశ్వర్యరాయ్‌, మణిరత్నం కాంబినేషన్‌లో ‘ఇరువర్‌’, ‘గురు’, ‘రావణ్‌’ సినిమాలు వచ్చాయి.  ఈ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఐశ్వర్యరాయ్‌ ఇటీవల ‘ఫనేఖాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  తాజాగా మరోసారి   నటి ఐశ్వర్యరాయ్‌ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీయబోతున్న సినిమాలో  నటించనున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.  కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా సినిమా తీయాలని మణిరత్నం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. 

ఈ సినిమాలో ‘నందిని’ అనే పాత్ర కోసం మణిరత్నం ఐశ్వర్యను సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  గతంలో వీరిద్దిరి మద్య స్నేహబంధం ఉన్న కారణంగా ఐషూ ఆ పాత్రకు ఒప్పుకున్నట్లు సమాచారం.  ట్విస్ట్ ఏంటేంటే ఆ పాత్ర ప్రతినాయకురాలి ఛాయలు ఉన్న పాత్ర కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: