పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున నర్సాపురం నుండి ఎంపి అభ్యర్ధిగా మెగా బ్రదర్ నాగబాబు పోటీలో దిగుతున్నారు. ఇప్పటికే అక్కడ జోరుగా ప్రచారం సాగిస్తుండగా ప్రచారంలో ఇప్పటికే మెగా డాటర్ నిహారిక పాల్గొన్నారు. అయితే జనసేనకు సపోర్ట్ గా చరణ్ తన సపోర్ట్ ఇవ్వగా అల్లు అర్జున్ ఓపెన్ లెటర్ రాశాడు.


ఇక ఇప్పుడు తండ్రి కోసం తన బాధ్యతగా ప్రచారంలో పాల్గొన్నాడు వరుణ్ తేజ్. ఈరోజు నుండి వరుణ్ తేజ్ అక్కడ ప్రచారం మొదలుపెట్టారు. షూటింగ్ కు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి షూటింగ్ స్పాట్ నుండి డైరెక్ట్ గా నర్సాపురం కు చేరుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఎన్నికల ప్రచారంలో బాబాయ్ ఆశయ సాధన కోసం తన తండ్రి బరిలో దిగారని ఆయన్ను గెలిపించాలని కోరాడు.


ప్రచారానికి హీరోలా కాకుండా ఓ జనసేన కార్యకర్తలా ఎర్రటి టవల్ తో కనిపించాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ను చూసేందుకు ఎక్కువమంది జనం అక్కడకు వచ్చారట. తన తండ్రిని.. జనసేనని గెలిపించాలని ప్రజలను కోరాడు వరుణ్ తేజ్. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు కిరణ్ డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. ఆ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడట. ఇప్పటికే ఆ సినిమాకు సంబందించిన బాక్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేశాడు వరుణ్ తేజ్. వాల్మీకి సినిమా హరీష్ శంకర్ డైరక్షన్ లో తెరకెక్కుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: