సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేశాడు. ఉగాది సందర్భంగా రిలీజైన మహర్షి టీజర్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 


ఇక టీజర్ రిలీజ్ ఈవెంట్ లో డైరక్టర్ వంశీ పైడిపల్లి మహేష్ గురించి అందరు డైరక్టర్స్ చెబితే ఏమో అనుకున్నా కాని నిజంగానే డైరక్టర్స్ యాక్టర్.. తను రాసుకున్న రిషి పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. అంతేకాదు సినిమా మీద తను చాలా నమ్మకంగా ఉన్నాడని అన్నారు వంశీ పైడిపల్లి. 


మహర్షి సినిమా నిర్మాతలు దిల్ రాజు, అశ్వనిదత్, పివిపిల సపోర్ట్ చాలా ఉందని. తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా తెలుగు ప్రేక్షకులు అందరికి నచ్చే సినిమాగా మహర్షి ఉంటుందని అన్నారు. టీజర్ లో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


టీజర్ లో మహేష్ లుక్స్ అదిరిపోయింది. సూటు బూటు వేసుకుని కనిపించి ఆ వెంటనే చెక్ షర్ట్, షార్ట్ హ్యాండ్ తో మీడియాకు సక్సెస్ అనేది డెస్టినీ కాదు అది జర్నీలో భాగం అంటూ చెప్పడం బాగుంది. రిషి జర్నీలో భాగమై ఈ మహర్షి సినిమాలో రిషి ఏం చెబుతాడో తెలియాలంటే మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: