మహర్షి సినిమా టీజర్  సంచలనాలు సృష్టిస్తోంది. టీజర్ కు మంచి టాక్, వ్యూస్ రావడంపై సినిమా టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా మహర్షి టీమ్ తమ సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిమాట్లాడుతున్నానని.. అందుకే కాస్త బెరుకుగా ఉందని వంశీ అన్నారు. 


ఈ సినిమా ట్రైలర్ కు వచ్చిన స్పందన చాలా అద్భుతంగా ఉందంటూ సంబరపడిన వంశీ.. మే 9 న వస్తున్న  ఈ సినిమా అందరినీ అలరిస్తుందన్నారు. తనను నమ్మి ఇంత పెద్ద ప్రాజక్టు అప్పగించిన నిర్మాతలకు వంశీ థాంక్స్ చెప్పారు. అదే సమయంలో హీరో మహేశ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు వంశీ. 


అందరూ మహేశ్ ను ప్రొడ్యూసర్స్ స్టార్ అని అంటుంటారని.. అలా ఎందుకు అంటున్నారో తనకు ఇప్పుడు అర్థమైందన్నారు. ఈ సినిమాకు మహేశ్ సహకారం మరచిపోలేనన్నారు వంశీ.  ఈ సినిమాలో మహేశ్ రిషి అనే పాత్రకు మహేశ్ ప్రాణం పోసారని చెప్పుకొచ్చారు.

మహర్షి మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న మరో సందేశాత్మక చిత్రం ఇది. 



మరింత సమాచారం తెలుసుకోండి: