నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలతో తన ప్రతిభ చాటుకున్న డైరక్టర్ కిశోర్ తిరుమల థర్డ్ మూవీగా మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు.


జీవితంలో అసలేమాత్రం సక్సెస్ లేని విజయ్ పాత్రలో సాయి తేజ్ కనిపిస్తాడు. యాదృచ్చికం ఏంటంటే సుప్రీం తర్వాత సాయి తేజ్ కూడా వరుసగా ఆరు ఫ్లాపులతో విసిగిపోయాడు. అందుకే సినిమాలో విజయ్ పాత్రలానే సక్సెస్ కోసం తాను ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.


ట్రైలర్ చూస్తే ఈసారి సాయి తేజ్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. సక్సెస్ అనేది తన డిక్షనరీలో లేని విజయ్ ప్లేట్ సక్సెస్ ఉంటే ఇస్తావా అంటూ అడగడం విచిత్రంగా ఉంటుంది. అంతేకాదు ఇద్దరి ప్రేయసుల మధ్య విజయ్ లవ్ స్టోరీ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. చిత్రలహరి సాయి తేజ్ చాలా సెటిల్డ్ గా మెగా హీరోల ఇమేజ్ ను వాడుకోకుండా సొంతంగా ప్రయత్నించాడని అనిపిస్తుంది.


మరి తేజ్ చేసిన ఈ సిన్సియర్ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సినిమాకు దేవ్ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా 6 ఫ్లాపులతో కెరియర్ సందిగ్ధంలో ఉన్న సాయి తేజ్ చిత్రలహరితో తప్పకుండా సక్సెస్ కొట్టేస్తున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మరో 5 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: