అందానికి ఆమె చిరునామాగా చెబుతారు. విశ్వసుందరి బిరుదు ఎటూ ఉంది. ఆమె అనేక చిత్రాల్లో నటించి తనదైన బ్రాండ్ వేసుకుంది. యువ గుండెలపై బలమైన ముద్ర వేసుకుంది ఆమె ఐశ్వర్యమంతా అందమే. ఆమెను చూసే కళ్ళకు కూడా ఐశ్వర్యమే మరి. అటువంటి ఐశ్వర్యంలో నటన, అందం ఇంకా రెట్టింపు అవుతున్నాయి

 

 

ఇప్పటి వరకు హీరోయిన్ గా ప్రేక్షకుల మనసు దోచిన బాలివుడ్ నటి ఐశ్వర్వరాయ్ విలన్ గా తన నటనా కౌశలాన్ని చూపించబోతున్నది. ప్రముఖ దర్శకులు మణిరత్నం విలన్ పాత్ర కోసం ఆమెను సంప్రదించగా ఓకే చెప్పేసింది. కల్కి రచించిన పొన్నియన్ సెల్వన్ పుస్తకం ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది.

 


ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో రూపొందించిన ఇరువర్, గురు, రావణ్ చిత్రాలలో ఐష్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. జయం రవి, శింబు, విక్రమ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కనున్న చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో ఉంటుందని సినీవర్గాల కథనం. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: