టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఎవరూ అంటే వెంటనే చెబుతారు.. ఎం ఎస్ రాజు.  ఆయన నిర్మించిన సినిమాలు వరుసగా సిల్వర్ జూబ్లీ లు అయ్యాయి దాంతో ఎం ఎస్ రాజు పట్టిందల్లా బంగారమే అనుకున్నారు కానీ కాలం మారింది.  ఆ మద్య అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ సమయంలో ఒక నెల ముందే నెట్ లో లీక్ కావడంతో ఈ నిర్మాత ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ఆ సినిమాపై తనకు గట్టి నమ్మకం ఉందని..మంచి కలెక్షన్లు రాబడుతుందని అన్నారు..నిజంగానే అత్తారింటికి దారేది సూపర్ హిట్ అయ్యింది. 

అయితే సినీ పరిశ్రమలో అన్ని రోజులు మనవి ఉండవు కదా.. ఎప్పుడైతే అదృష్టం తిరగబడుతుందో అప్పుడు అగ్ర నిర్మాత కూడా అనామకుడిలా మారిపోతాడు ఇప్పుడు అదే పరిస్థితి ఎం ఎస్ రాజు పరిస్థితి . ఇటీవల కాలంలో ఎం ఎస్ రాజు నిర్మించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.  కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.  దాంతో ఆయన  ఆర్ధికంగా కూడా చితికిపోయాడు. అయితే ఈ నిర్మాతను కాపాడే హీరో ఎవరైనా ఉన్నారా అంటే..ఉన్నారని అంటున్నాయి ఫిలిమ్ వర్గాలు.

కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రభాస్ కి ‘వర్షం’లాంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించాడు ఎంఎస్ రాజు. ఎం ఎస్ రాజు నిర్మించిన వర్షం చిత్రంతో ప్రభాస్ స్టార్ అయ్యాడు , దాని తర్వాత పౌర్ణమి అనే సినిమా చేసారు ఈ ఇద్దరూ కలిసి ఆ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది . దాంతో తనకు మరో సినిమా చేసి పెడతానని అప్పట్లో ప్రభాస్ హామీ ఇచ్చాడట. ఇప్పుడు ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా మార్కెట్ ఉంది దాంతో ప్రభాస్ ఎం ఎస్ రాజు కు డేట్స్ ఇస్తే ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉందని ఫిలిమ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: