ప్రీతి జింటాకు తన పాత ప్రియుడి వల్ల చేదు అనుభవం ఎదురైంది. తనకు జరిగిన అవమానంపై ప్రీతి జింటా ఎలా స్పందిస్తారోననే విషయం ఆసక్తిగా మారింది.  ఐపీఎల్‌లో భాగంగా మొమాలిలో ఇటీవల ఢిల్లీ, కింగ్స్ ఎలెవెన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడానికి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది. అయితే గో ఎయిర్ ఫ్లయిట్‌ల ఎక్కడానికి వీలులేదని ప్రీతీకి సిబ్బంది చెప్పడంతో షాక్‌కు గురైంది. 


గో ఎయిర్ విమాన సంస్థకు నెస్ వాడియా యజమాని. గతంలో నెస్‌తో ప్రీతి జింటాకు ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. దాంతో గో ఎయిర్‌లో ప్రయాణించకుండా నెస్ వాడియా ఆమెపై ఆంక్షలు విధించాడు. ఈ క్రమంలోనే ప్రీతిని సిబ్బంది విమానంలో ప్రయాణించకుండా అడ్డుకొన్నారు. గో ఎయిర్‌లో ప్రీతి జింటాకు బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా నిరాకరించారు. దాంతో ఆమె వారితో తగువులాడింది. మాకు పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.


అందుచేత మీకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేం అని చెప్పడంతో సిబ్బందిపై ప్రీతి జింటా భగ్గుమన్నది. బోర్డింగ్ పాస్ ఇచ్చేంత వరకు కదిలేదని కౌంటర్ వద్ద ధర్నా చేసినంత పని చేసింది. అదే సమయంలో ఎయిర్‌పోర్టులో కలిసిన దియా మిర్జాతో ప్రీతి జింటా టిఫిన్ చేస్తుండగా గోఎయిర్ సిబ్బంది విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. దాంతో దియా మధ్యలోనే టిఫిన్ వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ప్రీతిని విమానం ఎక్కకుండా గో ఎయిర్ సిబ్బంది అడ్డుకోవడంతో ఆమె అందులో ప్రయాణించలేకపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: