తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు ఎవరంటే వెంటనే చెబుతారు రాంగోపాల్ వర్మ. ఆయన తీసిన చిత్రాలు ఎప్పుడూ ఎదో ఒక కాంట్ర వర్సీలు ఉండటం షరా మామూలే. ఇటీవల రాంగోపాల్ వర్మ నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. మొదటి నుంచి ఈ చిత్రం రాజకీయ రంగు పులుముకుంటూ వచ్చింది. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు ను విమర్శించే సన్నివేశాలు ఉన్నాయని టీడీపీ శ్రణులు అభ్యంతరాలు తెలుపుతూ కోర్టు మెట్టెక్కాయి.
మొత్తానికి ఈ చిత్రం ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయి మంచి కలెక్షన్లు రాబడుతుంది. తాజాగా రాంగోపాల్ వర్మ దర్శకుడిగా కాకుండా ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు నిన్న తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. తాజాగా వర్మ నటుడిగా మారుతున్నారన్న వార్త విని చాలా మంది వివిధ రకాలుగా స్పందించారు.
తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. తనకు పోటీ వచ్చిందని సరదాగా వ్యాఖ్యానించారు. "చిట్టచివరకు రామ్ గోపాల్ వర్మ... నా 'సర్కార్' తన అసలైన రూట్ కొచ్చారు. నటన... ఆల్ ది బెస్ట్ సర్కార్... డామ్... ఇంకో పోటీ నాకు" అని అన్నారు. తాజాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.