టాలీవుడ్ లో నాగశౌర్య నటించిన ‘ఛలో’మూవీతో తొలిపరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘గీతాగోవిందం’సినిమా తో టాప్ పొజీషన్ లోకి వెళ్లింది.  ఒక్క సినిమా ఈ కన్నబ్యూటీ జాతకాన్ని మార్చింది.  ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లో కొన్ని సినిమాల్లో బిజీగా ఉంది.  విజయ్ దేవరకొండ సరసన మరోసారి ‘డీయర్ కామ్రెడ్’సినిమాలో నటించిన విషయం తెలిసిందే.  ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పై పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. 

ప్రస్తుతం త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది.  ఈ మూవీలో బన్ని సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. దీనికోసం సుకుమార్ కథపై చాలా హోం వర్క్ చేస్తున్నట్లు సమాచారం.  రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సుకుమార్ పై చాలా అంచనాలు పెరిగిపోయాయి. 

అయితే ఈ సినిమాలో బన్ని సరసన రష్మిక అయితే బాగుంటుందనే ఉద్దేశంతో సుకుమార్ ఆమెను సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో మొదలుకానుంది.  సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో రష్మిక హీరోయిన్ అయితే..ఆ సినిమా హిట్ అందుకుంటే కొంత కాలం వరకు తనకు తీరుగే ఉండదు.  ఈ ఇద్దరితో కలిసి ఒకేసారి ఆయన హ్యాట్రిక్ హిట్స్ కొడతాడేమో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: