పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమాణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లాంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న సాయిధరమ్ తేజ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు.  దాంతో తన పేరు ధరమ్ అచ్చిన రావడం లేదని ఈ మద్య సాయితేజ్ అని పిలిపించుకోవడం ఆరంభించాడు ఈ మెగా హీరో.  ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగింది. 

ట్రైలర్ పై మంచి స్పందనే వస్తుంది. ప్రేమకథా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా దర్శకుడు కిషోర్ తిరుమలకు మంచి పేరు వచ్చింది.  ఈసారి కూడా ఓ అందమైన ప్రేమకథనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకొస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది.  ఇదో అందమైన ప్రేమ కథ అని..ఓ సామాన్యమైన యువకుడి చుట్టూ అల్లుకున్న కథ ఎలా మలుపులు తిరిగింది అని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. 

అయితే ఈ సినిమా ఒక కత్తెర కూడా పడకుండా  బయటికి రావడం విశేషం.  దీన్ని బట్టి సినిమాలో ఎలాంటి వైలెంట్, అశ్లీలం లేదని తెలిసిపోతుంది. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ తో పాటు మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ నటిస్తుంది. మరో ముఖ్యమైన పాత్రలో కమెడియన్ సునీల్ నటిస్తున్నారు. కాగా,  ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సాయితేజ్ కి మాత్రమే కాదు .. కల్యాణి ప్రియదర్శన్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: