భారత దేశంలో హిందువులు పాటించే సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టు బొట్టు పై పాశ్చాత్యులు ఎంతో మక్కువ చూపిస్తుంటారు. ఇక్కడ సాంప్రదాయాలంటే వారికి ఎంతో ఇష్టం. భారత దేశానికి పర్యటనకు వచ్చిన ఎంతో మంది ఇక్కడి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు. ఇక హాలీవుడ్ స్టార్ హీరో విల్స్మిత్ ఇక్కడ సాంప్రదాయాలంటే ఎంతో గౌరవిస్తారు. విల్స్మిత్ తరుచూ భారత పర్యటన చేస్తుంటారు.
తాజాగా మరోసారి ఇండియాలో పర్యంటించిన ఆయన హరిద్వార్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి కార్యక్రమంలో విల్ స్మిత్ పాల్గొన్నారు. భారత్లో పర్యటించిన హాలీవుడ్ నటుడు విల్ స్మిత్... ఆధ్మాత్మిక భావనతో పరవశించిపోయారు. ఓ సామాన్యుడిలా నేలపై కూర్చొని హరిద్వార్ విశిష్టతను తెలుసుకున్నారు.
ఈ విషయమై విల్ స్మిత్ ఇన్ స్టా గ్రామ్ లో స్పందిస్తూ..‘భారత పర్యటన నాలో చైతన్యాన్ని నింపింది. ఈ పర్యటన ఓ అద్వితీయమైన అనుభవం. మా బామ్మ ఎప్పుడూ చెపుతూ ఉండేది.. దేవుడు మనకు అన్ని అనుభవం ద్వారా తెలియజేస్తాడు. భారత పర్యటన నాకు నా పట్ల, నా కల పట్ల, ఈ ప్రపంచం పట్ల కొత్త అవగాహన కలిగించింది’ అంటూ కామెంట్ చేశారు. కాగా, విల్ స్మిత్ ఇన్ స్టా గ్రామ్ పోస్టుకు ఏకంగా 15 లక్షలకు పైగా లైక్ లు రావడం గమనార్హం.