తెలుగు ఇండస్ట్రీలో సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్  అయ్యింది.  మొదటి ఈ చిత్రంపై ఎన్నో విమర్శలు వచ్చాయి.  ఇందులో లిప్ లాక్ సీన్లు విపరీతంగా ఉన్నాయని..బోల్డ్ కంటెంట్..బోల్డ్ సంభాషనలు ఉన్నాయని తెగ విమర్శలు వచ్చాయి.  కానీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్ల పరంగా భారీగానే వసూళ్లు చేసింది.  సున్నితమైన ప్రేక్ష కథాంశంతో సాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.   

ఈ చిత్రంలో షాలినీ పాండ కూడా అద్భుతంగా నటించింది.  తాజాగా ఈ చిత్రం బాలీవుడ్ లో రిమేక్ అవుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఈ చిత్రం రూపొందినా..కొన్ని అనివార్య కారణాల వల్ల రీ షూట్ చేస్తున్నారు.  బాలీవుడ్ లో ఈ చిత్రం సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు.  విజయ్ దేవరకొండ పాత్రలో షాహిత్ కపూర్ నటిస్తున్నాడు.  షాలినీ పాత్రలో కియారా అద్వాని నటిస్తుంది.   కాగా ఈరోజు టీజర్ ని రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.  ‘కబీర్ సింగ్’ టీజర్ చూస్తుంటే అచ్చం అర్జున్ రెడ్డి టీజర్ చూస్తున్నట్లే అనిపిస్తుంది.   

అర్జున్ రెడ్డి చిత్రం వచ్చి అప్పుడే మూడేళ్లు కావస్తోంది దాంతో స్క్రిప్ట్ లో ఇంకా ఏమైనా మార్పులు చేసాడో లేదంటే యాజిటీజ్ గా తీసాడో  రిలీజ్ అయ్యాక కానీ తెలీదు. త్వరలోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ‘కబీర్ సింగ్ ’చిత్రాన్ని జూన్ 21న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: