ఈటివి కామెడీ షో జబర్దస్త్ రియాలిటీ షో ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఐదేళ్లుగా ఈ షో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ షోలో కమెడియన్స్ మారుతూ వస్తున్నా జడ్జులు మాత్రం నాగబాబు, రోజాలే ఉంటారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి.


అయితే ఏపి ఎలక్షన్స్ లో జనసేన తరపున నాగబాబు, వైసిపి తరపున రోజా బరిలో దిగుతున్నారు. అందుకే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ చేసే ఛాన్స్ లేకుండాపోయింది. గతవారం నాగబాబు, రోజాలకు బదులుగా ఢీ జడ్జ్ శేఖర్ మాస్టార్ తో పాటుగా సీనియర్ హీరోయిన్ మీనా జడ్జులుగా వచ్చారు.


నాగబాబు, రోజాలు ఇద్దరు జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఆల్రెడీ స్టార్స్ అయిన వారు ఈ షో ద్వారా మరింత ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే కేవలం ఎలక్షన్స్ వరకే జడ్జులుగా వీరిని తీసుకున్నా ఈసారి గెలిస్తే తాను జబర్దస్త్ మానేస్తా అని చెప్పింది రోజా. కాబట్టి శేఖర్ మాస్టర్ టెంపరరీగా ఉన్నా నాగబాబు వస్తే తప్పకుండా మళ్లీ ఆయన్ను రీప్లేస్ చేస్తారు.


ఒకవేళ రోజా గెలిస్తే తను ఎలాగు రానన్నది కాబట్టి మీనా జబర్దస్త్ షో కంటిన్యూ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ గా తెలుగు సూపర్ స్టార్స్ అందరితో నటించిన మీనా ఇప్పుడు బుల్లితెర ఆడియెన్స్ ను అలరించడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరి రోజా ప్లేస్ లో మీనా కొనసాగిస్తే నాగబాబు మళ్లీ జబర్దస్త్ కు వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: