తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లో ఒకరు వంశి పైడిపల్లి.  తీసిన చిత్రాలు తక్కువే అయిన దాదాపు అన్ని మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.  దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు వంశి పైడిపల్లి.  ప్రస్తుతం వంశి పైడిపల్లి - మహేష్ బాబు కాంబినేషన్ లో ‘మహర్షి’చిత్రం రూపొందుతుంది.   ఈ చిత్రానికి  సంబంధించి పోస్టర్లు, లిరికల్ సాంగ్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్ బిజీలో పడ్డారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డె నటిస్తుంది. మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటిసస్తున్నాడు.  తాజాగా వంశీ సతీమణి మాలిని పుట్టినరోజు జరుగగా, ఈ పార్టీలో తారల సందడి కనిపించింది.

మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి ఈ పార్టీకి హాజరు కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి పార్టీకి హాజరై, మాలినికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో 'బృందావనం' విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: