తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ మొదటిసారిగా నెగిటీవ్ షేడ్స్ లో కనిపించాడు.  ఇక ఇంట్రవెల్ తర్వాత కోర్టు సీన్లు ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా ‘సింబ’చిత్రంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు.  తమిళంలో వెంకట్ మోహన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా ఈ చిత్రాన్ని ‘అయోగ్య’పేరుతో నిర్మిస్తున్నారు.  


ఠాగూర్ మధు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఇక కాజల్ పాత్రలో రాశీఖన్నా నటిస్తుంది. మే 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కంపోజ్ చేస్తున్న సమయంలో విశాల్ కి గాయం అయ్యింది..కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.  


ఈ మద్య ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ.. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని..నా కెరీర్ లో ఇదో అద్భతమైన చిత్రంగా నిలుస్తుందని అన్నారు.  ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో నేను కూడా మే 10 కోసం అంతగా ఎదురు చూస్తున్నానని అన్నారు.  తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం సూపర్ హిట్ కావడమే కాదు భారీ స్థాయిలో వసూళ్లు కూడా రాబట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: