అక్కినేని నాగార్జున రాజకీయాలకు చాల దూరంగా ఉంటాడు. అయితే అక్కినేని కోడలు సమంత తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని గెలిపించి ‘సైకిల్’ గుర్తుకు ఓటు వేయండి అంటూ నిన్న ఎన్నికల ప్రచారం ముగింపుకు వస్తున్న సమయంలో ఇచ్చిన పిలుపు హాట్ టాపిక్ గా మారింది. 

రేపు జరగబోతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న సత్య ప్రసాద్ ను గెలిపించమని సమంత పిలుపు ఇచ్చింది. అంతేకాదు అతడు తనకు అన్నగారు అంటూ ఒక కొత్త బాంధవ్యాన్ని కూడ బయట పెట్టింది. దీనితో షాక్ అయిన చాలామంది ఈ ఎన్నికల క్లైమాక్స్ ఘట్టంలో ఈ సత్య ప్రసాద్ ఎవరు అన్న వివరాలు సేకరించడం ప్రారంభించారు.  

ఈ అనుకోని సంఘటనకు షాక్ అయిన సమంత అభిమానులు ఆ వ్యక్తి ఎవరు అంటూ సమంతను ట్విటర్ ద్వారా ప్రశ్నించడంతో సమంత స్పందించింది. సత్య ప్రసాద్ తనకు చాల సన్నిహితుడనీ ఆయన సోదరి డాక్టర్ మంజుల తనతో కలిసి ‘ప్రత్యూష ఫౌండేషన్’ కార్యక్రమాలలో సహకరిస్తున్న మంచి వ్యక్తి అనీ అందువల్లనే తాను సత్య ప్రసాద్ ను గెలిపించమని పిలుపు ఇచ్చాను అంటూ క్లారిటీ ఇచ్చింది. 

దీనితో సమంత ఇచ్చిన పిలుపు వైరల్ గా మారింది. ముఖ్యంగా తెలుగుదేశ వర్గాలు తమకు అనుకోకుండా సమంత ఓపెన్ సపోర్ట్ దొరకడంతో జోష్ తో ఉన్నాయి. వాస్తవానికి సమంత పిలుపుతో ఎన్ని ఓట్లు పడతాయి అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఎన్నికల క్లైమాక్స్ లో సమంత చేసిన ట్విట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: