తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన వైవీఎస్ చౌదరి ఇటీవల ఆయన విలక్షణ నటుడు మోహన్ బాబు పై చెక్ బౌన్స్ కేసు వేయడం వార్తలు చూశాం.  దీనిపై ఇటీవల కోర్టు తీర్పును కూడా ప్రకటించింది. అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తనపై మానసికంగా..దాడులు మొదలయ్యాయని వైవీఎస్ చౌదరి ఆవేదన చెందుతున్నారు. ఈ మద్య మోహన్‌‌బాబు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైవీఎస్ చౌదరి ఆరోపిస్తూ ఓ లేఖను విడుదల చేశారు.

ఈ విషయమై మోహన్‌బాబుకు లీగల్ నోటీసులు పంపించారు. గతంలో మంచు విష్ణు హీరోగా ‘సలీం’చిత్రం సమయంలో తాను   జల్‌పల్లి గ్రామంలో మోహన్‌బాబు నివసిస్తున్న ఆయన ఇంటి పక్కన స్థలాన్ని ఖరీదు చేశానని..అయితే ఇటీవల కోర్టు తీర్పు అనంతరం మోహన్ బాబు ఆ స్థలంలోకి తనను రానీవ్వకుండా, ఆయన మనుషులతో అడ్డు చెబుతూ బెదిరింపులకు పాల్పపడుతున్నారని బాధపడుతున్నారు.

తన కష్టార్జితంతో కొన్న ఆ ఇంటి స్థలం విషయంలో ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నారని..తనను మానసికంగా వేదిస్తున్నారని అందుకే శాశ్వత పరిష్కారం కోసం న్యాయ నిపుణులను సంప్రదించినట్టు తెలిపారు. ఈ మేరకు మోహన్‌బాబుకు లీగల్ నోటీసు పంపించినట్టు వైవీఎస్ చౌదరి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: