టాలీవుడ్ లో  అక్కినేని, నందమూరి, మెగా ఫ్యామిలీలకు ఎంతో గౌరవం ఉన్న విషయం తెలిసిందే.   ఈ ఫ్యామిలీల నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోలు వస్తునే ఉన్నారు.  అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత ఆయన తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా వచ్చారు.  జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగ చైతన్య ‘ఏం మాయ చేసావే’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  దాంతో పాటే ఆ సినిమాలో తన సహనటి సమంతను రియల్ లైఫ్ లో గాఢంగా ప్రేమించారు. 

మనం సినిమా తర్వాత ఇరువురి పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు.  గత ఏడాది వీరి వివాహం జరిగింది.  అయితే పెళ్లైన తర్వాత ఈ జంట సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.  సమంత నటించిన సినిమాలు వరుసగా హిట్ కావడం మరో విశేషం.  ఇక పెళ్లైన తర్వాత ఈ జంట మొదటి సారిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’సినిమాలో నటించారు.  మొదటిసారిగా  ఈ జంట కలిసి నటించడంతో సినిమా పై బారీ అంచనాలే నెలకొన్నాయి.  దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పాజిటీవ్ తెచ్చుకోవడం..మంచి హిట్ సాధించడం జరిగింది. 

ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే రాంచరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.   ఉపాసన అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ మాత్రమే కాదు, 'బీ పాజిటివ్ హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్' మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్ కూడా.  ఇటీవల తన మ్యాగజైన్ కోసం  జిమ్ లో వర్క్ ఔట్ చేస్తున్న సమంత వద్దకు వెళ్లి ఇంటర్వ్యూ తీసుకున్నారు.  ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. అత్యుత్తమ కోడలు అవార్డు ఇస్తే సమంతకే ఇవ్వాలన్నారు. సమంత స్వీటెస్ట్ మాత్రమే కాదు, పవర్ ఫుల్ కూడా అంటూ కితాబిచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: