ఆరు ఫ్లాప్ ల తరువాత సాయి ధరమ్ తేజ్ డబల్ హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా మారిపోవడంతో అతడి పేరును మార్చుకుని ‘చిత్రలహరి’ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం నైరాశ్యంలో ఉన్న తేజ్ ‘చిత్రలహరి’ లో పోషిస్తున్న హీరో పాత్ర అతడి ప్రస్తుత వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది.  

కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈమూవీలో హీరో పాత్ర సక్సెస్ రుచి చూడలేక తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడే క్యారెక్టర్ అని తెలుస్తోంది. జీవితంలో జీరో అయిపోయిన వ్యక్తి తన జీవితాన్ని ఎలా బాగుచేసుకున్నాడు అన్న కథ చుట్టూ ఈమూవీలోని హీరో పాత్ర అల్లుకుందని సమాచారం. 

ఒక వ్యక్తికి వచ్చే సక్సస్ ఆ మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది అన్న అంశం చుట్టూ అల్లుకున్న ఈమూవీ కథ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఎన్నికల హడావిడి తరువాత రేపు విడుదల కాబోతున్న ఈమూవీ పై తేజ్ చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈమూవీ అనుకున్నట్లుగా విజయవంతం కాకపోతే మెగా కాంపౌండ్ బ్యాక్ గ్రౌండ్ కూడ తేజ్ ను ఏ విధంగాను రక్షించలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

తేజు సరసన నివేథా పెతురాజ్ కళ్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఈమూవీ ట్రైలర్ అందరికీ నచ్చినా ఎన్నికల సునామీ తరువాత ఏర్పడ్డ ప్రశాంత వాతావరణంలో విడుదల కాబోతున్న ఈమూవీకి వచ్చే ఓపెనింగ్స్ బట్టి ఈమూవీ విజయం ఆధారపడి ఉంటుంది అని విశ్లేషకులు అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: