రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్స్ గా నటించాల్సి ఉంది. అయితే సినిమా నుండి అనూహ్యంగా డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె ప్లేస్ లో ఎవరు నటిస్తారు అన్నది ఇంకా తెలియలేదు.


రాజమౌళి ఆలోచనల్లో శ్రద్ధా కపూర్, జాన్వి కపూర్ వంటి వాళ్లు ఉన్నారని తెలుస్తుండగా లేటెస్ట్ గా నిత్యా మీన్న్ కు ఆర్.ఆర్.ఆర్ యూనిట్ నుండి కాల్ వెళ్లిందని తెలుస్తుంది. డైసీ స్థానంలో నిత్యా మీనన్ ను తీసుకుంటారా లేక మరేదైనా ఇంపార్టెంట్ రోల్ లో నిత్యా నటిస్తుందా అన్నది ఇంకా తెలియలేదు. 


రియల్ హీరోస్ అయిన సీతారామరాజు, కొమరం భీమ్ ల పాత్రల్లో ఎన్.టి.ఆర్, చరణ్ నటిస్తున్నారు. సినిమా ప్రస్తుతం పూణె షెడ్యూల్ జరుపుకోవాల్సి ఉంది కాని రాం చరణ్ జిం వర్క్ అవుట్స్ చేస్తున్న టైంలో గాయం అవడం వల్ల షూటింగ్ 3 వారాలు వాయిదా పడినట్టు తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.   


బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. 2020 జూలై 31న రిలీజ్ డేట్ ప్రకటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా బాహుబలి రికార్డులను తిరగరాసే సినిమా అవుతుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: