సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా చిత్రలహరి. రేపు అనగా ఏప్రిల్ 12 శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. వరుసగా 6 ఫ్లాప్ సినిమాలు ఫేజ్ చేసిన సాయి తేజ్ ఈసారి మరింత ఫోకస్ తో చిత్రలహరి సినిమా చేశాడు. సినిమాలో కూడా అసలు సక్సెస్ అనేదే లేని విజయ్ పాత్ర పోశించాడు సాయి తేజ్.


సక్సెస్ లో లేరు కాబట్టి ఈ కథ ఎంచుకున్నారా.. సక్సెస్ లో ఉంటే ఈ కథ చేసేవారు కాదా అంటూ మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగ సాయి తేజ్ సక్సెస్ లో ఉన్నా ఫెయిల్యూర్ లో ఉన్నా ఏ కథ ఎవరి దగ్గరకు రావాలో అదే వచ్చేస్తుంది. తేజ్ ఐలవ్యూ తర్వాత చాలా కథలు విన్నా కాని చిత్రలహరి కనెక్ట్ అయ్యిందని అన్నాడు సాయి తేజ్.


సెకండ్ హ్యాండ్, నేను శైలజా, ఉన్నది ఒకటి జిందగి సినిమాలతో ప్రతిభ చాటుకున్న కిశోర్ తిరుమల సాయి తేజ్ తో చిత్రలహరి చేశాడు. సినిమాలో తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. 


ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ఫలితంపై పూర్తి నమ్మకంగా ఉందన్న సాయి తేజ్.. తాము చేయాల్సింది చేశాం ఇక అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సాయి తేజ్ మెగా హీరోలను ఇమిటేట్ చేయకుండా సిన్సియర్ గా ట్రై చేసినట్టు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: