ఈమధ్య కాలంలో రేణు దేశాయ్ పవన్ అభిమానుల మధ్య మాటల వార్ చాల తగ్గింది. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో తిరిగి వీరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీనికి కారణం ఎన్నికలకు సంబంధించిన ఓటు వ్యవహారం. 

చాలామంది పవన్ అభిమానులు నిన్న జరిగిన ఎన్నికలలో తమ ఓటును వినియోగించుకున్న తరువాత ‘జనసేన’ పార్టీకి ఓటు వేయమంటూ రేణు దేశాయ్ కి మెసేజ్ లు పెట్టారు. ఈ మెసేజ్ లు విపరీతంగా పెరిగి పోవడంతో వీటి పై రేణు స్పందించింది. తన ఓటు హక్కు గురించి ఎవరు గుర్తు చేయవలసిన అవసరం లేదనీ తాను నివసిస్తున్న పూణేలో ఈనెల 23న ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు ఎలా ఓటు వేస్తాను అంటూ పవన్ అభిమానులకు క్లాస్ పీకింది రేణు.

అంతేకాదు తనకు ఓటు ప్రాధాన్యత గురించి లేర్చర్లు ఇస్తూ ఇంక్ పెట్టుకున్న వెళ్ళను చూపెడుతూ తనకు ఫోటోలు ట్యాగ్ చేయద్దు అంటూ పవన్ అభిమానుల పై విరుచుకు పడింది రేణు దేశాయ్. తనకు నచ్చిన వ్యక్తికి తాను ఓటు వేస్తాను అంటూ తన విషయాల గురించి కాకుండా ‘జనసేన’ గురించి ఆలోచించమనీ రేణు సెటైర్లు వేసింది.  

ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. నిన్నటి ఎన్నికలలో పవన్ అభిమానులు ఓటర్లు అందరిచేత ‘జనసేన’ కు ఓట్లు వేయించే విషయంలో దృష్టి పెట్టకుండా ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ ని టార్గెట్ చేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: